Header Banner

మరోసారి భారీ భూకంపం.. భారత్ చుట్టూ ప్రకంపనలు! రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో..

  Fri May 23, 2025 08:08        India

సరిహద్దు దేశం నేపాల్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పై 4.3 గా ఉన్నట్లు నేపాల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) తెలిపింది. శుక్రవారం అర్థరాత్రి 1 గంటా 33 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 10 కిలోమీటర్ల లోతులో నేపాల్ లో ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. భారత్ లోని సరిహద్దు ప్రాంతాలు కూడా భూ ప్రకంపనలకు గురైనట్లు సమాచారం.

 

 

అయితే భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అక్కడి విపత్తు నిర్వాహణ యంత్రాంగం పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిపింది. నేపాల్ భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచూ భూకంపాలకు లోనవుతోంది. ఇటీవల వారం వ్యవధిలోనే 4 సార్లు అక్కడ భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!

 

నేపాల్ ప్రాంతం సబ్ డక్షన్ జోన్ లో ఉంది. అందుకే తరచూ అక్కడ భూప్రకంపనలు సంభవిస్తుంటాయని అక్కడి విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కూడా నేపాల్ లోని పోఖారా ప్రాంతానికి సమీపంలోని కాస్కి జిల్లాలో ఈ భూకంపం వచ్చినట్లు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది. భూకంపం తీవ్రత చాలా దూరంగా వరకు వ్యాపించిందని స్పష్టం చేసింది.


వారం రోజుల్లోనే నేపాల్ కేంద్రంగా ఇది నాలుగో భూకంపం కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మే రెండో వారంలో తూర్పు నేపాల్ లోని సోలుఖుంబు ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా అదే ప్రదేశంలో రెండోసారి భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయబ్రాంతులకు లోను కావొద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!

 

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!

 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!



ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NepalEarthquake #EarthquakeAlert #NepalQuake2025 #SeismicActivity #NepalTremors #EarthquakeUpdate